Tuesday 20 August 2013

'బాహుబలి'ని అజ్ఞాతంలోకి నెట్టిన జక్కన్న..!

మగధీర.. టాలీవుడ్ లో రాజమౌళిన మేటి డైరెక్టర్ గా నిలబెట్టిన సినిమా.. దాన్ని మించిన సినిమా తీయాలనే తలంపుతో 'బాహుబలి'ని సృష్టించాడు దర్శక ధీరుడు జక్కన్న. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న
ఈ చిత్రం తాలూకూ వివరాలు ఎక్కడా బయట పడకూడదని రాజమౌళి జాగ్రత్త పడుతున్నాడట. ఇందులో భాగంగా ఏకంగా హీరో ప్రభాస్ కు ఆర్డర్స్ పాస్ చేశాడట. ఇంతకీ ఏమన్నాడనేగా మీ సందేహం..?! అక్కడికే వస్తున్నా.. బాహుబలి షూటింగ్ పూర్తయ్యే వరకూ ఎవరికంటా పడకూడదని ఆదేశించాడట. సినిమా రీలు థియేటర్లోకి వచ్చే వరకూ అజ్ఞాత వాసం చేయమన్నాడట. సో.. 'బాహుబలి' విశ్వరూపం చూడాల్సింది ఇక థియేటర్లలోనే అన్నమాట..!
టాలీవుడ్ లోనే అత్యంత భారీ చిత్రం...
ఇదిలా ఉండగా.. ఈ చిత్రం కోసం రూ. 150కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ ఏ తెలుగు చిత్రం కూడా ఇంత బడ్జెట్ తో రూపొందలేదు. ఈ సినిమాకు కూడా మొదట్లో వంద కోట్లు అంచనా వేసుకున్నారు. కానీ.. ప్రాజెక్టు మొదలైన తర్వాత బడ్జెట్ వ్యయం పెరిగిందని టాక్. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ దశ - దిశను జక్కన్న మార్చేస్తాడని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment