Tuesday 1 April 2014

'తొలి సంధ్య వేళలో'

కౌషిక్‌బాబు, హరీష్‌, అశ్విని నటీనటులుగా శ్రీ జాగృతి ఫిలింస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'తొలి సంధ్య వేళలో'. వంశీ, మెహర్‌ రమేష్‌ వద్ద పనిచేసిన
డి. మోహన్‌దీక్షిత్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కృష్ణుడు ఓ ముఖ్య పాత్రలో కన్పిస్తారు. వై.ఎల్‌. భాస్కరరాజు నిర్మాత. తూర్పుగోదావరిలోని పలు ప్రాంతాల్లో తొంబై శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. నిర్మాత మాట్లాడుతూ.. పల్లెటూరు నేపథ్యంలోసాగే చక్కని ప్రేమకథ ఇది. ఈ సినిమాకు కథే బలం. దర్శకుడు బాగా తెరకెక్కిస్తున్నారు. రావు రమేస్‌ పాత్ర, కృష్ణుడిపాత్ర, డైలాగ్‌లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. కౌషిక్‌బాబు లవర్‌బారుగా కన్పించబోతున్న ఈ చిత్రం ఫీల్‌గుడ్‌ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. తూర్పు గోదావరిలో రాజోలు, సఖినేటిపల్లి, గుడిమూల, అంతర్వేది, మల్కీపురం, కడియపు లంక తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎవరూ షూటింగ్‌ చేయనటువంటి లొకేషన్లలో షూటింగ్‌ చేశాం. ఒక పాట, ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈనెల 5నుంచి మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరించి నెలాఖరుకి సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేస్తాం. మేలో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.

No comments:

Post a Comment